DELHI AIIMS లో రోగికి బొద్దింకల ఆహారం..

by Disha Web Desk 6 |
DELHI AIIMS లో రోగికి బొద్దింకల ఆహారం..
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో దారుణమైన ఘటన జరిగింది. రోగులకు వడ్డించే భోజనంలో బొద్దింకలు రావడం తీవ్ర కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స కోసం ఓ చిన్నారిని ఆస్పత్రిల్లో చేర్చించారు. అయితే చిన్నారికి ఆపరేషన్‌కు ముందు ఏమి తినిపించలేదు. ఆపరేషన్ ముగిసిన ఎనిమిది రోజులకు సిబ్బంది పప్పు అన్నం అందించారు. తీరా బిడ్డకు అన్నం తినిపిద్దామని అనుకునేలోపు అందులో బొద్దింక కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపడుతామని తెలిపారు.

Next Story