90 సెకన్ల నా ప్రసంగంతో విపక్షాల కూటమి వణికిపోతుంది: ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
90 సెకన్ల నా ప్రసంగంతో విపక్షాల కూటమి వణికిపోతుంది: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన సమావేశంలో భారత ప్రధాని మోడీ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్, ఇండియా కూటమిలో భయాందోళనలు సృష్టించిందని అన్నారు. “నిన్నటి రోజు నేను రాజస్థాన్‌కు వచ్చినప్పుడు, నా 90 సెకన్ల ప్రసంగంలో దేశం ముందు కొన్ని వాస్తవాలను అందించాను. ఇది మొత్తం కాంగ్రెస్, ఇండియా కూటమిలో భయాందోళనలను సృష్టించింది. ‘మహిళల మంగళసూత్రాన్ని కాంగ్రెస్‌ లాక్కోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మీ ఆస్తులను లాక్కొని కాంగ్రెస్‌కు పంచేందుకు కాంగ్రెస్ తీవ్ర కుట్ర పన్నుతుందన్న సత్యాన్ని దేశం ముందు ఉంచానని ప్రధాని మోడీ మరోసారి గుర్తు చేశారు. 2014 తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏం జరిగేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. మీరు మోడీని ఢిల్లీలో సేవ చేసేందుకు ఎన్నుకున్నందుకు.. దేశం కోసం ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తు కోసం కాకుండా.. అత అధికారం కోసం ఎప్పుడూ బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.



Next Story

Most Viewed