- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తేదీలు ఫిక్స్.. ఎప్పటినుంచంటే...?
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 17 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి అన్ని పార్టీలు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి కోరారు. కొత్త పార్లమెంట్లో జరగబోయే తొలి సమావేశాలు ఇవే కావడం గమనార్హం. కాగా యూసీసీపై కొంత కాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో బిల్లును తీసుకురాబోతున్నదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కేంద్రం ఆలోచన ఏవిధంగా ఉందనేది ఆసక్తిగా మారింది.






