యువనేత తలపై కాల్చి చంపిన దుండగులు

by Disha Web Desk 12 |
యువనేత తలపై కాల్చి చంపిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: జేడీయూ యూవనేత సౌరభ్ కుమార్ తలపై బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు రెండుసార్లు కాల్చి చంపారు. ఈ ఘోరమైన సంఘటన యువనేత పాట్నాలో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్సా బజార్ గ్రామంలో జరిగిన కాల్పుల్లో సౌరభ్ తో పాటు ఉన్న మరో వ్యక్తి మున్ముమ్ కుమార్ గాయపడ్డాడని పున్‌పున్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆర్ సింగ్ తెలిపారు.

బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు సౌరభ్ తలపై రెండుసార్లు కాల్చగా, అతని సహచరుడు మున్మున్ కుమార్‌ను మూడుసార్లు కొట్టారు. ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా సౌరభ్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించగా, మున్మున్ పరిస్థితి విషమంగా ఉంది. పాట్నా పోలీసు బృందం రాత్రి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ హత్య పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నిరసనకు దిగారు.



Next Story

Most Viewed