- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ రాజీనామా..!
దిశ, నేషనల్ బ్యూరో: ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్లో కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. అక్టోబర్ 7 వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు సడెన్ గా ఇజ్రాయి సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చాయి. ఇజ్రాయెల్ కమ్యూనిటీపై ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 1200 మంది చనిపోగా.. మరో 250 మందిని బందీలుగా తీసుకుపోయారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకున్న ఇజ్రాయెల్ ఈ ఊహించని పరిణామాన్ని పసి గట్టలేకపోయింది. అప్పటి పరిణామాలకు బాధ్యత వహిస్తూ తాజాగా మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి అహరోన్ హలీవా రాజీనామా చేశారు.
అక్టోబర్ 7న హమాస్ దాడికి దారితీసిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ తమ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ చీఫ్ రాజీనామా చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ సహా అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దాడిని నిరోధించడంలో విఫలమైనందుకు మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేసిన మొదటి ఉన్నత స్థాయి అధికారి ఇతనే కావడం విశేషం. తన ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ తమకు అప్పగించిన పని పూర్తి చేయలేదని.. ఆ బ్లాక్ డేని ఎప్పటికీ మర్చిపోలేనని రాజీనామా లేఖలో పేర్కొన్నాడు హలీవా. ఆ బాధను తనతోనే ఎప్పటికీ ఉంటుందని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలన్న హలీవా అభ్యర్థనను మిలటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంగీకరించారని..అతని సేవకు ధన్యవాదాలు అని మిలటరీ ప్రకటనలో తెలిపింది.
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోయింది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగింది. గాజాపై డ్రోన్లు, క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. గాజాను నామరూపాలు లేకుండా చేసింది. అంతేకాకుండా హమాస్ ప్రతినిధులు టార్గెట్గా క్షిపణులను ప్రయోగించింది. ఇప్పటికే పలువురు చనిపోయారు. ఇప్పటికీ ఇజ్రాయెల్.. గాజాపై దాడులు చేస్తూనే ఉంది.
ఇక సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడిలో ఇరాన్కు చెందిన ముఖ్యమైన ఆఫీసర్లు చనిపోయారు. దీంతో ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్పై పగతో రగిలిపోతుంది. ఇప్పటికే బాలిస్టిక్, క్షిపణులు, డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా తాజాగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ఎటాక్ చేసింది. కానీ ఇరు దేశాలకు ఎలాంటి నష్టం జరగలేదు.. అయినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.