తెలంగాణకు అన్నామలై.. బండి సంజయ్ తరఫున ఎన్నికల ప్రచారం

by Disha Web Desk 12 |
తెలంగాణకు అన్నామలై.. బండి సంజయ్ తరఫున ఎన్నికల ప్రచారం
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే అవకాశం ఉన్న ప్రతి స్థానంలో కీలక నేతలతో ప్రచారం చేస్తూ.. ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సెలబ్రేటీలు, మాస్ లీడర్లను ఎన్నికల ప్రచారంలో భాగం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు సింగం గా పేరుగాంచిన మాజీ ఐపీఎస్, తమిళనాడు బీజేపీ అభ్యర్థి అన్నమలై ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తరఫున ప్రచారం చేయనున్నారు. జమ్మికుంటలోని శంకర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ యువ సమ్మేళనంలో ఆయన పాల్గోననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుర్తి సభలో పాల్గొంటారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలో.. కిషన్ రెడ్డి తరుఫున సాయంత్రం సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీలో పాల్గోననున్నారు.

Next Story

Most Viewed