- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
180కి పైగా దేశాలకు మెడిసిన్ అందించాం
by Phanindra |
కరోనా విపత్తు సమయంలో భారత్ 180కి పైగా దేశాలకు మెడిసిన్ అందించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయా అన్నారు.

X
న్యూఢిల్లీ: కరోనా విపత్తు సమయంలో భారత్ 180కి పైగా దేశాలకు మెడిసిన్ అందించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయా అన్నారు. వసుదైవ కుటుంబం అనేది భారతదేశ వారసత్వమని, విపత్తు సమయంలో భారత్ తన బాధ్యతను నెరవేర్చిందని చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిర్వహించిన వాకథాన్ లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. అనేక దేశాలు మెడిసిన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో భారత్ అండగా నిలిచిందన్నారు. దీంతో పాటు వ్యాక్సిన్లు కూడా సరఫరా చేసిందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో మెడికల్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- nationalnews
Next Story






