- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ లో చేరిన ప్రముఖ టీవీ నటి!
దిశ, డైనమిక్ బ్యూరో: అనుపమ, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వంటి సీరియల్స్ లో నటించిన ప్రముఖ టీవీ నటి రూపాలీ గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు వినోద్ తావ్డే, అనిల్ బలూనీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రూపాలీకి పుష్పగుచ్ఛం అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్న అనంతరం రూపాలీ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ దేశానికి చేస్తున్న అభివృద్ది చూసి పార్టీలో చేరానని, ఈ అభివృద్ది మహాయాగంలో తాను కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అలాగే ప్రతీ ఒక్కరినీ బీజేపీ వైపు ఆకర్షిస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ అని, ఆయన పని తీరు, వ్యక్తిత్వం, దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళుతున్న తీరు చూసి ప్రతి భారతీయుడు మోడీ సేనలో చేరాలని కోరుకుంటాడని అన్నారు. దీనికై మీ ఆశీస్సులు, సపోర్ట్ కావాలని తన అభిమానులను కోరారు. అనంతరం ప్రధాని మోడీ, జేపీ నడ్డాలను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభిమానిగా ఆయనను కలవడం నా కల అని, నా కల నెరవేరిన రోజును జీవితంలో మర్చిపోలేను అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో విడుదల చేశారు. కాగా సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే కామెడీ షోతో ప్రసిద్ధి చెందిన రూపాలీ గంగూలీ.. పలు హిట్ సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం అనుపమ అనే ప్రేక్షకాధరణ పొందిన సీరియల్ లో నటిస్తూ.. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు.