సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గత కొంత కాలంగా బీజేపీపై ఘాటుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం అలీపూర్ సెంట్రల్ హోమ్‌లో ఇండిపెండెన్స్ మ్యూజియాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. "దేశ స్వాతంత్ర్య పోరాటంలో బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించింది. బెంగాల్ నుండి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్య పోరాటంలో పునరుజ్జీవనానికి తీసుకువచ్చారు అని అన్నారు.

ఇదొక మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది'' అని సీఎం మమత అన్నారు. అంతే కాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రను 'రక్షించేందుకు' ప్రయత్నిస్తోందని అన్నారు. 'రాజకీయ ఉద్దేశం' కోసం భవిష్యత్ తరానికి నిజమైన చరిత్ర గురించి తెలియకుండా.. దేశ చరిత్రను 'మార్పు' చేస్తున్నారని ఎవరి పేరు ప్రస్తావించకుండానే ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ కామెంట్స్ ఇన్‌డైరెక్ట్‌గా బీజేపీని ఉద్ధేశించినట్లు చేసినట్లు అనిపిస్తోంది.


Next Story

Most Viewed