- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కను తిన్నదని అధికారులు మేకపిల్లను బంధించారు. ఈ ఘటన నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కానీ, మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్ మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ మొక్కలను ఆవులు, మేకలు ఆహారంగా మేస్తున్నాయి. శుక్రవారం ఓ మేక హరితహారం మొక్క తింటుండగా మున్సిపల్ అధికారులు చూసి, ఆ మేకను మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో, ఆవులను స్టేషన్కు తరలించి బంధించారు. అంతేగాకుండా.. వాటి యజమానులను మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు.
Next Story