మోదీతోనే అన్ని వర్గాలకు న్యాయం : కిషన్ రెడ్డి

by Disha Web Desk 11 |
మోదీతోనే అన్ని వర్గాలకు న్యాయం :  కిషన్ రెడ్డి
X

దిశ, అంబర్ పేట: ప్రధాని మోదీతోనే దేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి అన్నారు. గత పదేండ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పేదల సంక్షేమం కోసం, దేశ ప్రగతి కోసం, మోదీ పనిచేశారని చెప్పారు. సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కేంద్రంలో ఒక మైనార్టీని, దళితుడిని, గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీ దేనని కిషన్​ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర కేబినెట్​ లో అత్యధిక మంది బీసీలకు మోదీ అవకాశం కల్పించారని తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రధానిగా భారత కీర్తి ప్రతిష్టలు పెంచిన మోదీ ఒక బీసీ నేత అని గుర్తు చేశారు. 65 ఏండ్ల కాంగ్రెస్​ పాలనలో సామాజిక న్యాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్​ పార్టీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అంబేద్కర్​ ను ఎన్నికల్లో ఓడించి, ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాంగ్రెస్​ అవమానించిందన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మోదీ లక్ష్యం అని చెప్పారు. కాంగ్రెస్​ తెలంగాణలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.

గత పదేండ్లలో బీఆర్​ఎస్​ తెలంగాణ సంపదను దోచుకున్నదని అందుకే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపారన్నారు. ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్న ఈ రెండు పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని కిషన్​ రెడ్డి సూచించారు. మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించాలని, సికింద్రాబాద్​ నుంచి తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. ఈ సమ్మేళనంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ నాయకులు ఆనంద్ గౌడ్, సుభాష్ గౌడ్, భరత్ గౌడ్, సుప్రియ గౌడ్ తదితర గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More..

మళ్లీ వచ్చేది BRS ప్రభుత్వమే: హరీష్ రావు కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed