- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ ట్రాప్లో పడొద్దు..క్రైస్తవులకు అండగా ఉంటా-సుజనా చౌదరి
దిశ ప్రతినిధి,విజయవాడ: నియోజకవర్గ క్రైస్తవుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లంబాడీ పేట బేతెస్ట్ చర్చ్ను సుజనా చౌదరి ఆదివారం సందర్శించారు. సుజనాకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ పాస్టర్ అప్పికట్ల జవహర్ స్వాగతం పలికారు. క్రిస్టియన్ సమస్యలు సుజనా అడిగి తెలుసుకున్నారు. సలహాలు సూచనలు స్వీకరించారు.
రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని సుజనాని పాస్టర్ కాటూరి మోజెస్ పాస్టర్ అప్పికట్ల జవహర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. క్రైస్తవులు, ముస్లిం మైనారిటీ లపై ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా సుజనా చెప్పారు. క్రైస్తవులను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు. బీజేపీ అంటే అభద్రతాభావం పోగొట్టుకోవాలని, వైసీపీ మాటలు నమ్మవద్దని అన్నారు. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ క్రైస్తవులందరూ తమకు అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని సుజనా విజ్ఞప్తి చేశారు.