ఆ క్షణాలను కోల్పోతున్నాను.. వారికి క్షమాపణలు చెబుతూ స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 7 |
ఆ క్షణాలను కోల్పోతున్నాను.. వారికి క్షమాపణలు చెబుతూ స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం ‘రత్నం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియా భవానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మూవీ టీం. ఈ క్రమంలోనే ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలని ప్లాన్ చేశారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని నరసింహ రెడ్డి కాలేజీని వేదికగా కూడా ఫైనల్ చేశాడు. కానీ చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు విశాల్. ఈ విషయాన్ని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు తెలియజేస్తూ ఓ లేఖ రిలీజ్ చేశాడు హీరో విశాల్. ‘అభిమానులతో గడిపే మధురమైన క్షణాలను కోల్పోతున్నాను. దీనిని త్వరలో భర్తీ చేస్తాను. ‘రత్నం’ ఈవెంట్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేసి.. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలో ప్రకటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు విశాల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed