ఎల్లమ్మ గుడిలో చోరీ.. దొంగలను పట్టుకున్న గ్రామస్థులు..

by Disha Web Desk 23 |
ఎల్లమ్మ గుడిలో చోరీ.. దొంగలను పట్టుకున్న గ్రామస్థులు..
X

దిశ,మేడిపెల్లి : దేవుడని కూడా చూడకుండ ఏకంగా గుడిలోనే దొంగతనం చేసి పట్టుబడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా భీమారం మండలం దేశాయిపేట గ్రామంలో జరిగింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేశాయి పేట గ్రామములోని ఎల్లమ్మ గుడిలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి బంగారు ఆభరణాలు దొంగిలించారు. అయితే దొంగలు దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో చిక్కడంతో గ్రామస్థులు వెళ్లి చూడగా దొంగలు పరుగులు తీసి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి రంగాపూర్ వద్ద పట్టుకుని స్వల్ప దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. దొంగలను వెంటనే స్థానిక పోలీసులకు అప్పగించారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు కోరుట్లకు చెందిన వారని తెలిపారు.

Next Story

Most Viewed