స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘హీరామండి’ వెబ్ సిరీస్‍..!

by Dishafeatures1 |
స్ట్రీమింగ్  డేట్ ఫిక్స్ చేసుకున్న ‘హీరామండి’ వెబ్ సిరీస్‍..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. 1940ల కాలంలో భారత్ బ్రిటీష్ పాలనలో ఉన్నటువంటి ‘హీరామండి’ అనే రెడ్ లైట్ ప్రాంతంలో, జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్‍లో దర్శకుడు భన్సాలీ చూపించనున్నారు. అంటే బ్రిటిష్ పాలనలో దారుణాలు ఎదుర్కొన్న ఆ మహిళల గురించి ఎన్నో విషయాలు ఈ సిరీస్ లో చూపించనున్నాడు భన్సాలీ.

ఇక ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ , షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రివిలైనా ఫస్ట్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకోగా.. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మొత్తానికి చాలాకాలం సందిగ్ధత తర్వాత ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ‘హీరామండి’. ఈ ఏడాది మే 1నుండి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.


Next Story

Most Viewed