చైతన్య ఫోన్‌కు ఆ వీడియో పంపడం వల్లే సామ్‌కు డివోర్స్ ఇచ్చారు.. వీడియోతో సహా బయటపెట్టిన తీన్మార్ మల్లన్న?

by Disha Web Desk 9 |
చైతన్య ఫోన్‌కు ఆ వీడియో పంపడం వల్లే సామ్‌కు డివోర్స్ ఇచ్చారు.. వీడియోతో సహా బయటపెట్టిన తీన్మార్ మల్లన్న?
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత గురించి సుపరిచితమే. ‘ఏం మాయ చేశావే’ చిత్ర షూటింగ్ లో ఒక్కటైన ఈ జంట పెళ్లి వరకు వెళ్లారు. కానీ ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. మొన్నటి వరకు సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడింది. ఇప్పుడిప్పుడే కోల్కోని.. మళ్లీ సినిమాల బాట పడుతోంది.

ఇక చైతూ తండేల్ చిత్ర షూటింగ్ లో బిజీగా గడిపేస్తున్నాడు. అయితే సామ్ - చై విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగ్ అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, జడ్జ్ ల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తీన్మార్ మల్లన్న సమంత-నాగచైతన్య పై వస్తోన్న వార్తలపై స్పందించి..

సోషల్ మీడియాలో వీరిద్దరి పై వస్తోన్న వార్తలు నిజమే. వీరిద్దరు ఫోన్ ట్యాంపింగ్ వల్లే విడాకులు తీసుకున్నారు. సమంత ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆమెతో భేరసారాలు కుదరక.. చైతన్య ఫ్యామిలీకి ఓ వీడియో పంపారు. ఇందులో ఓ పొలిటికల్ లీడర్ ప్రమేయం కూడా ఉంది. అతడు మందుల వ్యాపారం చేస్తాడు. బ్లాక్ మెయిలే సమంత జీవితం నాశనం చేసిందంటూ తీన్మార్ మల్లన్న ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story