రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు యంగ్ హీరోయిన్ సీరియస్.. మొదట మూవీ గురించి మాట్లాడుకుందాం అంటూ కామెంట్

by Disha Web Desk 7 |
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు యంగ్ హీరోయిన్ సీరియస్.. మొదట మూవీ గురించి మాట్లాడుకుందాం అంటూ కామెంట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రుహానీ శర్మ గురించి తెలిసిందే. ‘చి.ల.సౌ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. రీసెంట్‌గా ‘శ్రీరంగనీతులు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అంజాసీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీతో మంచి హిట్ అందుకు సుహాస్ ఇందులో హీరోగా నటించగా.. ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 12 రిలీజై మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుహానీ రిపోర్టర్‌పై నవ్వుతూనే ఫైర్ అయింది.

‘మీరు నటించిన సినిమాలు మీ బావ కోహ్లి, అక్క అనుష్క చూస్తారా’ అని ప్రశ్నించాడు రిపోర్టర్. దీనిపై కొంచెం ఘాటుగానే స్పందించిన రుహానీ ‘మొదట మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అవి ఎందుకు’ అన్నట్లు ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావంతో.. ‘పర్సనల్ గొడవలు ఉన్నాయేమో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కాగా.. రుహానీ శర్మకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కజిన్ సిస్టర్ కాగా.. విరాట్ కోహ్లి బాబా అవుతాడు.

Read More...

తారక్ కోసమే ఆ పని చేశాను.. కాజల్ కామెంట్స్ వైరల్!

Next Story

Most Viewed