కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్‌సింగ్.. మొట్టమొదటిది హైదరాబాద్‌లోనే ఓపెనింగ్.. ఎక్కడంటే!

by Disha Web Desk 6 |
కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్‌సింగ్.. మొట్టమొదటిది హైదరాబాద్‌లోనే ఓపెనింగ్.. ఎక్కడంటే!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అమ్మడు నిర్మాత జాకీ భగ్నానీతో కొద్దికాలంగా ప్రేమలో ఉంది. ఇటీవల ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తుంది. అయితే ఉగాది పండుగ నేపథ్యంలో రకుల్ తను ఒక ఫుడ్ బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఎక్కడ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో హెల్త్‌ పరమైన వంటలు చేస్తానని తెలిపింది. అలాగే ఆరంభం అనే పేరుతో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అందరి దృష్టి రకుల్ పెట్టే ఫుడ్ బిజినెస్ పైనే పడింది.

తాజాగా, రకుల్ ఆరంభం రెస్టారెంట్‌ను మొట్టమొదటగా హైదరబాద్‌లోని కావూరి హిల్స్‌లో ప్రారంభించి ఎంతో మంది మెప్పు పొందుతుంది. స్వయంగా రకుల్ హైదరాబాద్‌కు వచ్చి మరీ రెస్టారెంట్‌ను ఓపెనింగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెస్టారెంట్‌లో ప్యాకింగ్ ఫుడ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయని సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ విదేశాల్లో కాకుండా మన హైదరాబాద్‌లో పెట్టడం గ్రేట్ అంటూ రకుల్ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చూడటానికి తరలివెళుతున్నారు. కాగా.. ఇప్పటికే రకుల్ f45 జిమ్ బిజినెస్ ఫ్రాంచైజీ ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. ఇక ఈ రెస్టారెంట్ వల్ల కూడా ఈ అమ్మడు బాగానే సంపాదించేలా ఉందని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed