ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సమంత, రకుల్ ప్రీత్‌తో పాటు మరో 13 మంది హీరోయిన్లు బలి..!

by Disha Web Desk 9 |
ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సమంత, రకుల్ ప్రీత్‌తో పాటు మరో 13 మంది హీరోయిన్లు బలి..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో సినిమా సెలబ్రిటీల నుంచి, ప్రముఖ రాజకీయ నాయకుల వరకు అందరూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు కుదిపేసిన విషయం తెలిసిందే.

గత ప్రభుత్వ హయాంలోని కొందరు టాప్ లీడర్లు రాజకీయ, బిజినెస్, సినీ, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి వారి సీక్రెట్స్‌ను గుప్పిట్లో పెట్టుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇందులో టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగానే, వీరితో పాటు మరో 13 మంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈ వార్తల వల్ల హీరోయిన్ల ప్రతిష్టకు, ఇమేజ్‌కు భంగం వాటిల్లే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.



Next Story

Most Viewed