చనిపోయిన మా కూతురికి వరుడు కావాలి.. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా..

by Sumithra |
చనిపోయిన మా కూతురికి వరుడు కావాలి.. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : వరుడు కావాలి, వధువు కావాలి... మీరు వార్తా పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు ఎన్నో చూసి ఉంటారు. వధువు లేదా వరుడు కోసం చూస్తున్న వ్యక్తులు వార్తాపత్రికలో ప్రకటన ఇస్తారు. తద్వారా వారికి తగిన వధూవరులు లభిస్తారు. అయితే ఈ రోజుల్లో, కర్ణాటక వార్తాపత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది, అందులో 30 సంవత్సరాల క్రితం మరణించిన తమ కుమార్తె కోసం ఒక కుటుంబం వరుడిని వెతుకుతోంది. చనిపోయిన తమ కూతురికి తగిన వరుడి కోసం కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. అయితే దీనికి కూడా వరుడు ఎలా ఉండాలనే కండిషన్ పెట్టాడు.

ఈ విచిత్రం దక్షిణ కన్నడలోని పుత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఓ కుటుంబం తమ కూతురు 30 ఏళ్ల క్రితం చనిపోయిందని స్థానిక వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చింది. అందుకు 30 ఏళ్ల క్రితం చనిపోయిన వరుడు కావాలి. అలాంటి వరుడు ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. వార్తాపత్రికలో వచ్చిన ఈ ప్రకటనతో పాటు చనిపోయిన బాలిక వివరాలను కూడా పొందుపరిచారు. అయితే పుత్తూరు ప్రాంత ప్రజలకు ఇది కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వారి పెళ్లిని ఇలాగే చేసే సంప్రదాయం ఉంది.

అవివాహితులుగా మరణించిన వారికి మాత్రమే వివాహాలు నిర్వహిస్తారు. చనిపోయిన పెళ్లికాని చిన్నారుల ఆత్మకు మోక్షం లభించడమే ఇందుకు కారణమని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఇక్కడ కొనసాగుతోంది. దీనిని 'క్యూలే మెడిమె' లేదా 'ప్రేత మదువే' అంటారు. 'క్యూలే మెడిమె' అనేది ఆత్మల మధ్య జరిగే వివాహం. ఇది తుళునాడు-దక్షిణ కన్నడ, ఉడిపి కోస్తా జిల్లాలలో ప్రబలంగా ఉన్న ఆచారం.

50 మంది సంబంధాన్ని పంపారు..

ప్రకటన ఇచ్చిన కుటుంబ సభ్యులు, 'గత వారం స్థానిక వార్తాపత్రికలో ఇది ప్రచారం చేయబడింది. అయితే ఈ ప్రకటనను ఎవరో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వార్తాపత్రికలో ప్రకటన కనిపించిన తర్వాత, సుమారు 50 మంది వ్యక్తులు మాకు వారి సంబంధాలను పంపారు. త్వరలో పూజలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తాం.

5 ఏళ్లుగా వరుడి కోసం వెతుకుతున్నాం..

ఐదేళ్లుగా ఆచారాన్ని నిర్వహించడానికి తగిన మ్యాచ్ కోసం వెతుకుతున్నానని చెప్పాడు. 'ప్రకటన ఇస్తున్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేస్తారేమోనని భయపడ్డాం. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే వివిధ కులాల వారు కూడా మమ్మల్ని సంప్రదించారు. ప్రజలు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారని, దాని పై విశ్వాసం ఉంచారని తెలిపారు.

Next Story

Most Viewed