- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. వరుసగా లక్కీ చాన్స్లు సొంతం చేసుకుంటోంది. టాలెంట్, లక్ కలిస్తే చాలు ఎక్కడి నుంచి వచ్చామనేది మ్యాటర్ కానే కాదని, కెరియర్లో దూసుకుపోవచ్చని నమ్మే కియారా.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. ‘కబీర్ దాస్, గుడ్ న్యూస్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న భామ.. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అక్షయ్ కుమార్తో చేసిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా ఓటీటీలో రిలీజ్కు సిద్ధంగా ఉండగా.. మరోసారి కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి మంచి ఆఫర్ అందుకుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. రాజ్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వరుణ్ ధావన్తో రొమాన్స్ చేయబోతోందట కియారా.
మరోవైపు తెలుగు ఇండస్ట్రీలోనూ కియారా కోసం వరుస ఆఫర్లు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో అవకాశాలు తలుపుతట్టాయని సమాచారం. ఇదే నిజమైతే అటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ బిజీ హీరోయిన్గా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.