- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తిరువనంతపురం: ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొద్దిరోజుల ముందుగానే కేరళ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.టి.జలిల్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆరోపణలతో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలిగారు. మంత్రిగా ఉండి తన బంధువులకు ఉన్నత పదవులు కట్టబెట్టి ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన లోకాయుక్త.. ఆయన పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని తెలిపింది.
ఈ మేరకు జలీల్పై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు పంపించింది. కాగా, లోకాయుక్త ఆర్డర్లపై స్టే విధించాలని జలీల్ సోమవారం హైకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేశారు. తన ఫేస్బుక్ పోస్టులో కూడా ఈ విషయాన్ని తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. జలీల్కు బంధువైన అదీబ్కు కేరళ స్టేట్ మైనారిటీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్ పోస్టును కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి.