Raj Kundra & Shilpa Shetty నాటకాలాడుతున్నరు.. Sherlyn Chopra షాకింగ్ కామెంట్స్

by  |
Sherlyn Chopra
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులు చేస్తున్న ఆరోపణలపై తాజాగా షెర్లిన్ చోప్రా స్పందించింది. తనపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేయడమే కాకుండా రాజ్ బెదిరింపులకు గురిచేశారని చెప్పింది. కానీ, ఇలాంటి వాటికి తాను భయపడనని, మానసికంగా వేధించినందుకు వారే తనకు రూ.75 కోట్లు తిరిగి ఇవ్వాలని నోటీసులు పంపినట్లు తెలిపింది. అలాగే గతంలో రాజ్‌కుంద్రా తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని కోరింది.

అయితే, ఇటీవల రాజ్‌కుంద్రాపై షెర్లిన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని, వాటిని నిరూపించేందుకు తగిన ఆధారాలు కూడా లేవన్న రాజ్ తరపు న్యాయవాది.. వివాదాలు సృష్టిస్తూ, మీడియాను ఆకర్షించేందుకు ఇలా చేసిందంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శిల్పా దంపతులు పరువు నష్టం దావా వేయడంపై స్పందించిన షెర్లిన్ తరపు న్యాయవాది సుహైల్ షరీఫ్.. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు పరువు నష్టం దావాను ఓ ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు.


Next Story

Most Viewed