ఆర్బీఐ నుంచి మరో రూ.1000 కోట్లు అప్పు తీసుకున్న జగన్ సర్కార్..

by  |
ap
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో రూ.1000కోట్ల రుణం సేకరించింది. రిజర్వ్ బ్యాంకు దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని పొందింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా ప్రభుత్వం మంగళవారం మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది. 17 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 18 ఏళ్ల కాల పరిమితితో మరో రూ. 500 కోట్లు సెక్యూరిటీ బాండ్లను వేలం వేశారు. తీసుకున్న వెయ్యి కోట్ల మొత్తానికి 7 శాతం చొప్పున వడ్డీని చెల్లించేలా ఈ బాండ్లను జారీ చేశారు. ఈ తాజా అప్పుతో ఏపీకి కేంద్రం ఇచ్చిన రుణ పరిమితిలో మరో రూ. 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అదనపు రుణ పరిమితి కోసం ఏపీ ఆర్థికశాఖ మంత్రి, అధికారులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed