చినస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ ఊచకోత.. ఐపీఎల్‌లో చరిత్రలోనే భారీ స్కోర్

by Disha Web Desk 12 |
చినస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ ఊచకోత.. ఐపీఎల్‌లో చరిత్రలోనే భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. 20 ఓవర్ల మ్యాచ్‌లో 200 కంటె ఎక్కువ పరుగులు చేస్తూ.. సంచలనంగా మారుతున్నారు. ఈ సీజన్ లో భీకర ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన స్కోర్లను సాధిస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం బెంగళూరు జట్టుతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మరోసారి రికార్డులు సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లపై మొదటి ఓవర్ నుంచి రెచ్చిపోయిన బ్యాటర్లు.. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు. మరి ముఖ్యంగా ఓపెనర్ హెడ్ 39 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. అలాగే యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అలాగే హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 67 పరుగులు బంతులు చేశారు. విరితో పాటుగా మార్క్రమ్ 32, సమద్ 37 దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు 287 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి, తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్ల దాటికి ఆర్సీబీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

Next Story

Most Viewed