- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. గతనెల 16న టీకా పంపిణీ ప్రారంభమైంది. కాగా తక్కవ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం యూఎస్, యూకేల తర్వాత అత్యధికులు టీకా పొందిన దేశంగా మూడో స్థానంలో భారత్ నిలవడం గమనార్హం. అమెరికా, యూకేల తర్వాత కరోనా టీకా అత్యధికులకు అందించిన దేశం భారతేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 57,75,322 మందికి టీకా వేసినట్టు తెలిపింది.
ఇందులో 53,04,546 మంది ఆరోగ్య సిబ్బంది, 4,70,776 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు ఉన్నారని పేర్కొంది. వీరందరికి టీకా వేయడానికి 1,15,178 సెషన్లను నిర్వహించామని వివరించింది. కాగా, శనివారం ఒక్క రోజు 8,875 సెషన్లలో 3,58,473 మందికి టీకా వేసినట్టు తెలిపింది. ఎక్కువ మంది టీకా వేసుకున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్(6,73,542) ముందుందని, రెండు, మూడు స్థానాల్లో మహారాష్ట్ర(4,73,480), రాజస్థాన్(4,59,652)లున్నాయని వివరించింది.