- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నో ఏళ్ల తర్వాత కలవబోతున్న శుక్రుడు-బృహస్పతి.. ఈ రాశుల వారికి అంతా శుభమే..!
దిశ, ఫీచర్స్: ఈ నెల చివర్లో గురు, శుక్ర గ్రహాలు కలవబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వలన ఈ రాశుల వారు ఎన్నో మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృషభం
వృషభ రాశిలో శుక్రుడు, బృహస్పతి కలవడం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు అధిక జీతం, పదవి పొందే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు చేసే పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది.
మేషరాశి
వృషభరాశిలో గురు, శుక్రుల కలయికతో, మేషరాశి వారు అపారమైన కీర్తి, సంపదను పొందుతారు. ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేరుతోంది. సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల గణనీయమైన రాబడిని పొందవచ్చు. అంతేకాకుండా, ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు మీ కెరీర్లో అనుకూలమైన స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులకు అపూర్వమైన లాభాలు వస్తాయి.