ఉగాది పంచాంగం : ఈ ఐదు రాశుల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే!

by Disha Web Desk 8 |
ఉగాది పంచాంగం : ఈ ఐదు రాశుల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే!
X

దిశ, ఫీచర్స్ : ఉగాది పండుగ వచ్చేస్తుంది. ఏప్రిల్9న శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాగా, ఈ సంవత్సరంలో ఈ ఐదు రాశుల వ్యాపారస్తులకు కలిసి వచ్చే సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. కాగా, అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : రోధినామ సంవత్సరం ఈ రాశి వ్యాపారస్థులకు కలసి వస్తుదంట. ఆదాయం భారీగా పెరుగుతుంది. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయంట.

మిథున రాశి : సంవత్సరం ఈ రాశి వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు వస్తాయి.

తుల రాశి : రీ క్రోధినామ సంవత్సరం తుల రాశి వారి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది.జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు. కాంట్రాక్టు , రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది

మకర రాశి : మకరరాశి వ్యాపారులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసొస్తుంది. శని అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు. కాంట్రాక్టు పనులు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. బంగారం వ్యాపారులకు మొదటి ఆరు నెలలు కన్నా ఆ తర్వాత బాగుంటుంది.

మీన రాశి :ఈ ఉగాది నుంచి మీన రాశి వ్యాపారులకు అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ మీ సొంతం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు భారీగా లాభాలు ఆర్జిస్తారు. శని, గురుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టే ఉంటుంది.


Next Story

Most Viewed