విద్యార్థులకు శుభవార్త.. గురుకుల ప్రవేశాలకు మరో చాన్స్

by  |
విద్యార్థులకు శుభవార్త.. గురుకుల ప్రవేశాలకు మరో చాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని టీఎస్‌డబ్ల్యూ‌ఆర్ఎస్/జూనియర్ కళాశాలల్లో జనరల్, వృత్తి విద్యా కోర్సుల్లో జూనియర్ ఇంటర్మీడియట్‌లో ప్రవేశ పరీక్ష (టీఎస్‌డబ్లూ‌ఆర్‌జేసీ-సెట్-2021) కోసం అర్హులైన, ఆసక్తికర అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

వీరికి ఏప్రిల్ 4న ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదిక 2020-21 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ ద్వారా పదో తరగతి అభ్యర్థులు సైతం ఈ నెల10వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలను www.tswreis.in, www.tswreisjc.cgg.gov.in సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


Next Story

Most Viewed