టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. బాధలో నందమూరి హీరోలు

by  |
టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. బాధలో నందమూరి  హీరోలు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు భయాందోళనలకు దారి తీస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు గా చిత్ర పరిశ్రమలో విషాదాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేష్ కోనేరు గుండెపోటుతో క‌న్నుమూశారు. నిర్మాతగా ఆయన ఇటీవలే రెండు సినిమాలను నిర్మించారు, సత్య దేవ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా చేసిన 118, తిమ్మ‌ర‌సు,మిస్ ఇండియా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా పలువురు స్టార్ హీరోలకు పీఆర్ఓ గా పనిచేశారు,. ఆయా హఠాన్మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటును మిగల్చనుంది. కళ్యాణ్ రామ్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఆ తరువాత పలు హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ఇకపోతే మహేష్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ స్పందిస్తూ ” మహేష్ మరణ వార్త విని షాక్ అయ్యాను.. నా మిత్రుడు ఇక లేడు.. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నాకు మాటలు రావడం లేదు. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. మహేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెల్సిన పలువురు ప్రముఖులు సైతం మహేష్ మృతి పట్ల సానుభూతి తెలుపుతున్నారు.

Next Story

Most Viewed