- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఉష్ణోగ్రతలు 3.4 డిగ్రీలకు పడిపోయాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలిపులి వణికిస్తోంది. రోజు రోజు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 3.6, కొమురంభీం జిల్లా గిన్నెధరిలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో కేవలం 6 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా దొంగిల్లో 4.7, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.0, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సత్వర్లో 5.1 డిగ్రీలు నమోదైంది. మరోవైపు హైదరాబాద్లో కూడా చలి పెరుగుతోంది. రాజేంద్రనగర్ పరిధిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 7.8గా ఉంది.
Next Story