- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కూకట్పల్లి : బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఎస్.లక్ష్మి అనే ఓ మహిళ తనకు తెలిసిన వారు “లైటినింగ్ పవర్ బ్యాంక్” యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని చెప్పారు. దీంతో సదరు మహిళ www.lightningbp.com/hs/pages/register/register? లింక్నుంచి లైటినింగ్పవర్ బ్యాంక్యాప్ ను డౌన్లోడ్ చేసి, అందులో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. కొద్దిసేపటి తరువాత ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్చేసి మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులకు తక్కువ సమయంలో అధిక రాబడి వచ్చిందని నమ్మించాడు.
కొద్దిసేపటి తరువాత తను పెట్టిన డబ్బులకు లాభం వచ్చినట్టు ఎస్ఎంఎస్వచ్చింది. దీంతో ఆశ ఎక్కువై సదరు మహిళ తనతో పాటు, తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరి వద్ద నుంచి వసూలు చేసిన 12,91,025 రూపాయలను యాప్ ద్వారా పెట్టుబడి పెట్టింది. ఎంతసేపటికి ఎటువంటి ఫోన్ కాల్ కాని, లాభం కాని రాకపోవడంతో తను మోసపోయానని భావించిన సదరు మహిళ బుధవారం బాలానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వహీదుద్దిన్ తెలిపారు.