నేడే అక్షయ తృతీయ.. ఈ రోజు బంగారం కొనాలా, వద్దా..పండితులు ఏం చెప్తున్నారంటే?

by Disha Web Desk 8 |
నేడే అక్షయ తృతీయ.. ఈ రోజు బంగారం కొనాలా, వద్దా..పండితులు ఏం చెప్తున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : నేడు అక్షయ తృతీయ. దీని కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అక్షయ తృతీయ వచ్చేసింది. అ ఈ ఏడాది మే 10వ తేదీ అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజు. ఇక ఈరోజు చాలా మంది ఆలయాలకు వెళ్లి దేవుడిని పూజించడమే కాకుండా బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా ఈరోజు శుభకార్యాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు పండితులు. అన్నదానం చేయడం, వ్రతాలు చేయడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా ఈ రోజు అనగానే గోల్డ్ కొనుగోలు చేయడమే పనిగా పెట్టుకుంటారు మహిళలు. ఎందుకంటే ఈరోజు బంగారంతో పాటు లక్ష్మీ కూడా ఇంట్లోకి వస్తుందని వారి నమ్మకం. అయితే అసలు ఈ బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం ఈరోజు మంచిదేనా అంటే.. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదు. ఈరోజు కేవలం దానాలు మాత్రమే చేయాలని, బంగారం వెండి వస్తువులు కొనమని చెప్పలేదంటున్నారు పండితులు. కేవలం ఇది వ్యాపారస్థుల పన్నాగం తప్ప, బంగారం కొనుగోలు చేసినంత మాత్రాన వారు కోటీశ్వరులు అయితపోతారా? నలుగురికి అన్నం పెట్టడం చాలా మంచిది అంటున్నారు పండితులు. కానీ అలాంటి పనులు ఏవీ చేయకుండా ఈ మధ్య చాలా మంది బంగారం, వెండి కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. ఇది ఎక్కడా లేదు అంటూ తెలుపుతున్నారు పండితులు.

(నోట్ : ఇది ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు. ఇది వారి వారి నమ్మకాల మాత్రమే ఆధారపడి ఉంటుంది.)


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed