ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

by Disha Web Desk 12 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదం.. బేస్తవారిపేట మండలం పూసలపాడు దగ్గర.. ఆటో, కారును ఢీకొనడంతో జరిగింది. ఆటో, కారు ఎదురేదుగా బలంగా ఢీ కొనడంతో ఆటోలో మంటలు చెలరేగాయి. దీంతో ఆటోలోనే ఇద్దరు సజీవ దహనం అయ్యారు. అలాగే మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా పోలీసులు గుర్తించారు. అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story