- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.!
దిశ,మరిపెడ /తొర్రూర్ : వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై తొర్రూర్ మండల పరిధిలోని మాటేడు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల మహేష్(27) అతని కుమారుడు నవతేజ్ (5) తో కలిసి ద్విచక్ర వాహనంపై తొర్రూర్ లో తమ సమీప బంధువు ఇంట్లో జరుగుతున్న వేడుకకు ఈ రోజు (శనివారం )ఉదయం బయలుదేరి వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం, తిరిగి గుండంరాజుపెల్లి గ్రామానికి కి వస్తుండగా మాటేడు చివర సమీపంలో కర్ణాటక కు చెందిన ప్రైవేటు ట్రావెల్ పెళ్లి బస్సు బైకును ఢీకొట్టింది.
ఢీకొట్టిన బస్సు ఆ..బైక్ తో సహా వీరిద్దరిని కొంత దూరం ఈడ్చుకు వెళ్ళింది. దీంతో బైక్ పై ఉన్న తండ్రి హరీష్, కుమారుడు నవతేజు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారి దేహాలు చిద్రమయ్యాయి. వీరితోపాటు తొర్రూర్ లో అదే వేడుకకు హాజరై వస్తున్న వీరి బంధువులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మహేష్, ముక్కుపచ్చలారని కుమారుడి అకాల మరణంతో గుండంరాజుపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. తొర్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.