BREAKING: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

by Disha Web Desk 1 |
BREAKING: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అతివేగంతో కారు అదుపుతప్పి చెట్టును కారు ఢీకొట్టగా.. ఆరుగురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలో బెలగాలి వద్ద చోటుచేసుకుంది. ధార్వాడ్‌లోని లంగోటి నుంచి కారులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది బెలగావికి బయలుదేరారు. ఈ క్రమంలో కారు బెలగావి వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డును పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులను షారూక్ పెండారి, ఇక్బాల్ జమాదార్, సానియా లంగోటి, ఉమ్రాబేగం లంగోటి, షబానా భాను లంగోటి, పరన్ లంగోటిగా పోలీసులు గుర్తించారు.

Next Story

Most Viewed