బావిలో కుళ్ళిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

by Disha Web Desk 11 |
బావిలో కుళ్ళిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ, హన్వాడ : వ్యవసాయ పొలం దగ్గర ఉన్న బావిలో కుళ్ళి పోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శనివారం హన్వాడ మండల పరిధిలోని వేపూర్ గ్రామ శివారులో వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. హన్వాడ మండల పరిధిలోని వేపూర్ శివారులో గల భీమయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో అటుగా వచ్చిన రైతు భీమయ్య బావిలోకి చూడగా బావిలో వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో ఈ విషయాన్ని గ్రామస్థులకు, హన్వాడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న హన్వాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి శరీరం బోర్లా పడి ఉబ్బడం తో గుర్తుపట్టలేని స్థితిలో శవం ఉందని సుమారు వారం పదిరోజుల క్రితం బావిలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు మృతదేహం పై ఉన్న ఆనవాళ్లతో ఇటీవల మిస్సింగ్ కేసులు నమోదైన వారితో పోల్చి చూస్తూ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Next Story