గుడిలో గంటకు వేలాడుతున్న యువకుడి శవం.. హత్యనా..? ఆత్మహత్యనా..?

by Disha Web Desk 7 |
గుడిలో గంటకు వేలాడుతున్న యువకుడి శవం.. హత్యనా..? ఆత్మహత్యనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎన్నో దారుణ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఒకదగ్గర ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. కానీ, కొంత మంది మరణాలు సస్పెన్స్‌గా ఉండి.. పోలీసులకు సవాల్‌గా మారుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. అనుహ్యంగా గుడిలో గంటలకు ఓ యువకుడి మృతదేహం వేలాడుతూ ఉంది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్య ప్రదేశ్‌లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శ్రవణ్ దాస్‌కు దైవ భక్తి ఎక్కువ. దీంతో మహంత్ లక్ష్మణ్ దాస్ అనే వ్యక్తికి శిష్యుడుగా గత ఎనిమిది ఏళ్లుగా రాజస్థాన్, నాగోలా గ్రామంలో యోగేశ్వర్ ధామ టెంపుల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 8 గంటల సమయంలో మహంత్ దాస్‌కు భోజనం వండి ఒడ్డించాడు. అనంతరం తన స్నేహితులను కలవడానికి శంకర్ గ్రామాని వెళుతున్న అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. కాగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాను నివాసం ఉంటున్న యోగేశ్వర్ ధామ్ గుడిలోనే గంటలకు ఉరితాడుతో వేలాడుతూ కనిపించాడు. అయితే.. శ్రవణ్ మోకాళ్లు నేలకు ఆనుకుని ఉన్నాయి. దీంతో పోలీసులకు ఈ కేసు సస్పెన్స్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో దర్వాప్తు చేస్తున్నారు.


Also Read....

ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొని బోల్తా కొట్టిన ట్రాక్టర్

Next Story

Most Viewed