మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమెండో చీఫ్ పరమ్‌జిత్ హతం

by Disha Web Desk 19 |
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమెండో చీఫ్ పరమ్‌జిత్ హతం
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్తాన్ కమెండో చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పరమ్‌జిత్ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం పాక్‌లోని లాహార్‌లో గుర్తు తెలియని ఆగంతకులు పరమ్‌జిత్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పరమ్‌జిత్ మరణించాడు. ఈ ఘటనలో పరమ్‌జిత్‌తో పాటు అతడి ఇద్దరు బాడీగార్డ్స్ కూడా మరణించినట్లు రాడికల్ సిక్కు సంస్థ దాల్ ఖల్సా నాయకుడు కన్వర్ పాల్ సింగ్ ధృవీకరించారు. పరమ్‌జిత్ ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లగా అతడిపై గుర్తు తెలియని ఆగంతకులు జరిపిన కాల్పులు అతడు మరణించాడని తెలిపారు. కాగా, పరమ్‌జిత్ హత్యతో లాహార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడిని హత్య చేసింది ఎవరు.. ఎందుకు చేశారు అన్న విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఖలిస్తాన్ కమెండో హత్యకు గురికావడంతో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో భారీగా భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Next Story