కళ్ళల్లో కారం కొట్టి బంగారు గొలుసు చోరీ

by Dishafeatures2 |
కళ్ళల్లో కారం కొట్టి బంగారు గొలుసు చోరీ
X

దిశ, ఎంజీఎం సెంటర్/లేబర్ కాలనీ: లేబర్ కాలనీ 100 ఫీట్ రోడ్ లో కళ్ళల్లో కారం కొట్టి ఆరు తులాల బంగారం గొలుసు దొంగిలించిన సంఘటన మంగళవారం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని బుర్కా ధరించిన యువతి నర్సంపేట రోడ్డులోని లేబర్ కాలనీ 100 ఫీట్ రోడ్ లో తోట అండమ్మ ఇంట్లో ఇల్లు అద్దెకి ఇస్తారా అంటూ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి 70ఏళ్ల వృద్ధురాలు అయిన అండమ్మ కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు చోరీ చేసి పరారైంది. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వరంగల్ ఏసీపీ గిరి కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్ కాలనీ ఇన్స్ పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు.


Next Story

Most Viewed