వాళ్ల బలిదానానికి ప్రతీక మొహర్రం : సీఎం జగన్

by  |
వాళ్ల బలిదానానికి ప్రతీక మొహర్రం : సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో అన్ని పండుగలూ నిరాడంబరంగా జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రానున్న మొహర్రం వేడుకలు కూడా నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వాలతో పాటు, ప్రజలు కూడా భావిస్తున్నారు.

తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అందరికీ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు.‘మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి ప్రతీక మొహర్రం. ధర్మ పరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహర్రం గుర్తు చేస్తుంది. మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదాం.’ అంటూ ట్వీట్ చేశారు.


Next Story