కారు దహనం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by  |
కారు దహనం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నోవాటెల్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కారు దహనం చేశారు. ఈ ఘటన సోమవారం విజయవాడంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. హోటల్‌కు సమీపంలో కారుపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా కారులో ఉన్న వేణుగోపాల్ అనే వ్యక్తి 80 శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ గొడవలే కారణం అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Next Story

Most Viewed