- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్యూన్ ఉద్యోగానికి Phd అభ్యర్థులు.. భారత్లో నిరుద్యోగమే ప్రధాన సమస్య: రఘురామ్ రాజన్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్లో ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ, ఉపాధి దృష్ట్యా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి యువతకు తగినన్ని ఉద్యోగాలు అందిస్తుందా అన్నదే ముఖ్యమైనది. 1.4 బిలియన్ల బలమైన భారత జనాభాకు, ఉద్యోగాల కల్పన ఒక కీలకమైన ఆందోళనగా మిగిలిపోయిందని అన్నారు.
దేశంలోని 19 రాష్ట్రాల్లో 10,000 మంది ఓటర్లపై నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది ఓటర్లలో నిరుద్యోగం ప్రధాన ఆందోళనగా ఉంది. 2014లో నిరుద్యోగిత రేటు 4.9 శాతంగా ఉండగా, అది 2023 నాటికి 5.4 శాతానికి పెరిగింది. మరో నివేదిక అయితే ఫిబ్రవరి 2024కి ఇది 8 శాతానికి పైగా ఉందని అంచనా వేసింది. అలాగే, చిప్ల తయారీకి భారత్ బిలియన్ల డాలర్లు వెచ్చించడాన్ని రాజన్ విమర్శించారు. సేవలు, తయారీ, వ్యవసాయ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా భారత్ నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని రాజన్ అన్నారు.
రైల్వేలో ప్యూన్ల ఉద్యోగాలకు కూడా పెద్ద సంఖ్యలో Phd చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు, ప్రస్తుత పరిస్థితులకు ఇది నిదర్శనం. గత ఐదేళ్లలో ఉద్యోగాలు దొరకడం మరింత కష్టతరంగా మారిందని ఒక సర్వేలో పాల్గొన్న దాదాపు 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నిరుద్యోగం ప్రధాన ఎన్నికల సమస్యగా మిగిలిపోయింది, ఇప్పుడు కూడా అది ఇంకా అలాగే కొనసాగుతోందని రాజన్ తెలిపారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తన లోక్సభ 2024 మేనిఫెస్టోలో పేర్కొన్న అప్రెంటిస్షిప్ ఆలోచనను రాజన్ ఆమోదించారు. దీనిని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా యువతకు మంచి ఉద్యోగం చేయగల సామర్థ్యాన్ని అందించడానికి వీలవుతుందని అన్నారు. అలాగే, ఇటీవల ఎన్డీయే విడుదల చేసిన చేసిన శ్వేతపత్రంలో 'నిరుద్యోగం' అనే పదం గురించి ప్రస్తావించలేదని రాజన్ ఎత్తి చూపారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించనందున పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని ప్రభుత్వ లోపాలను రాజన్ హైలెట్ చేశారు.