- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మార్చి 30, 31 తేదీల్లో పనిచేయనున్న LIC
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ వారంతంలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన అన్ని కార్యాలయాలు మార్చి 30, మార్చి 31 తేదీల్లో తెరిచి ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు, ఇతర లావాదేవీల గురించిన సమగ్ర వివరాలను అందించాల్సి ఉంటుంది. అయితే శని, ఆదివారాలు సెలవు ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆ రెండు రోజుల్లో ప్రత్యేకంగా ఎల్ఐసీ కార్యాలయాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
ఇప్పటికే బ్యాంకులు కూడా ఆ రోజుల్లో పనిచేయనున్నాయి. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI సలహా మేరకు, ఎల్ఐసీ కూడా పాలసీదారుల కోసం శని, ఆదివారాల్లో పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 30, 31 తేదీల్లో అధికారిక పని గంటల ప్రకారం జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ కార్యకలాపాల కోసం తెరిచి ఉంటాయి.