టీఆర్ఎస్‎లో చేరిన బీజేపీ కార్పొరేటర్..!

by  |
టీఆర్ఎస్‎లో చేరిన బీజేపీ కార్పొరేటర్..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఉమారాణి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఉమారాణి, ముత్యాలు టీఆర్ఎస్‎లో చేరారు. ఆదివారం హైదరాబాద్‎లో వారిద్దరికి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ఉమారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మెన్ భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed