కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఇస్తోంది : ఎమ్మెల్యే యెన్నం

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఇస్తోంది :  ఎమ్మెల్యే యెన్నం
X

దిశ, హన్వాడ : కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఇస్తోంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హన్వాడ మండలంలోని పెద్ద ధర్పల్లి, ఎనిమిది తండా, కొత్త చెరువుతండా, పిల్లిగుండు తండాలలో పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం యెన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లంబాడా , బంజారా , ఆదివాసీల వెనుకబాటు తనం నుంచి విముక్తి కోసం నాడు రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది అని కానీ నరేంద్ర మోడీ రిజర్వేషన్లను తొలగిస్తానని చెప్పడం మన అభివృద్ధికి ఆటంకం కలిగించడమేనని మండిపడ్డారు.

అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి మన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి చేతి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది అని యెన్నం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, ఆరు గ్యారెంటీలను అర్హులైన వారికి అమలు చేస్తున్నాం అని, ఎన్నికల కోడ్ వల్లనే కొన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. మోడీ గత పది సంవత్సరాలుగా మనకు ఏమి చేయలేదని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా చిల్లిగవ్వ నిధులు మంజూరు చేయలేదని , గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి చేశారు అని తెలిపారు.

అలాగే కేసీఆర్ కి రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ మహబూబ్ నగర్ కు ద్రోహం చేసి అభివృద్ధి అంతా కేసీఆర్ సొంత జిల్లా మెదక్ కు వేలకోట్ల రూపాయలు తరలించారు అని ఆయన ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తొల్ల మాసయ్య తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి సురేందర్ రెడ్డి, మహేందర్ , కృష్ణయ్య, నవనీత, లక్ష్మణ్ నాయక్, దేవేందర్ నాయక్, రాజు, రామస్వామి గౌడ్, చిన్న యాదయ్య గౌడ్, భీమేష్, కేశవులు, ఖాదరయ్య, రవీందర్ గౌడ్, పి వెంకటేష్, మారుతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story