500 మైళ్లకు చేరిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర

by  |
500 మైళ్లకు చేరిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర
X

దిశ, సంగారెడ్డి: లోక కళ్యాణార్థం సంగారెడ్డి నుంచి శబరిమలకు కొక్కొండ శ్రీశైలం, సాహితీ రాము గురుస్వాముల ఆధ్వర్యంలో 22 మంది స్వాములు ప్రారంభించిన మహా పాదయాత్ర గురువారం 500 కిలోమీటర్లు చేరుకుంది. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయం నుంచి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల మీదుగా 20 రోజుల తర్వాత కర్ణాటకకు చేరింది. అయ్యప్ప స్వామి శరణు ఘోష, భజనలు చేసుకుంటూ గురుస్వాములు, స్వాములు పాదయాత్రలో ముందుకు సాగారు. డిసెంబర్ 15వ తేదీన శబరిమల చేరుకుంటామని గురుస్వాములు తెలిపారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ, విశ్వనాథ్ రావు, దామోదర్, గుండ్లపల్లి నరేష్, మానిక్ రెడ్డి, వెంకన్న, పరమేశ్వర్ గౌడ్, ప్రభు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed