- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సంగారెడ్డి: లోక కళ్యాణార్థం సంగారెడ్డి నుంచి శబరిమలకు కొక్కొండ శ్రీశైలం, సాహితీ రాము గురుస్వాముల ఆధ్వర్యంలో 22 మంది స్వాములు ప్రారంభించిన మహా పాదయాత్ర గురువారం 500 కిలోమీటర్లు చేరుకుంది. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయం నుంచి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల మీదుగా 20 రోజుల తర్వాత కర్ణాటకకు చేరింది. అయ్యప్ప స్వామి శరణు ఘోష, భజనలు చేసుకుంటూ గురుస్వాములు, స్వాములు పాదయాత్రలో ముందుకు సాగారు. డిసెంబర్ 15వ తేదీన శబరిమల చేరుకుంటామని గురుస్వాములు తెలిపారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ, విశ్వనాథ్ రావు, దామోదర్, గుండ్లపల్లి నరేష్, మానిక్ రెడ్డి, వెంకన్న, పరమేశ్వర్ గౌడ్, ప్రభు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Next Story