ఏపీ ఎంసెట్ అప్లికేషన్ గడువు రేపటి వరకు 

by  |
ఏపీ ఎంసెట్ అప్లికేషన్ గడువు రేపటి వరకు 
X

దిశ, వెబ్ డెస్క్: ఎంసెట్‌కు అప్లై చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం వరకు లేట్ ఫైన్ తో అప్లికేషన్ గడువు పొడిగించింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు రూ.10 వేల ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ నెల 17 న ఏపీ ఎంసెట్ పరీక్ష జరగనుంది.

అక్టోబరు 1న జరిగే లాసెట్‌కు 2,000 రుసుముతో ఈనెల 25 వరకు, పీజీఈసెట్‌కు 2,000 రుసుముతో 23వ తేదీ వరకు, 500 రుసుముతో ఎడ్‌సెట్‌కు 25 వరకు, 500 రుసుముతో పీఈసెట్‌ సెప్టెంబరు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Next Story