వైసీపీ పాలనలో నష్టపోయింది మహిళలే:టీడీపీ ఎంపీ

by Disha Web Desk 18 |
వైసీపీ పాలనలో నష్టపోయింది మహిళలే:టీడీపీ ఎంపీ
X

దిశ,వెబ్‌‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలు సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల పార్టీలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం టీడీపీ ఎంపీ రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది మహిళలేనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. మహిళలకు రక్షణ మళ్లీ రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. కూటమి అధికారంలోకిి వస్తే ప్రజలకు రక్షణ వస్తుంది అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అరాచాకాలు అంతం అవుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా కూటమిని ప్రజలు ఆశీర్వదించి స్వాగతం పలకాలని కోరారు. అతి త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించబోతుంది అని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed