vizianagaram: లే ఆఫ్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ.. ఆందోళనలో కార్మికులు

by Disha Web Desk 16 |
vizianagaram: లే ఆఫ్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ.. ఆందోళనలో కార్మికులు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో స్మెల్ టెక్ ఫెర్రో అల్లాయిస్ కంపెనీ లే ఆఫ్ ప్రకటించింది. మెరకముడిదాం మండలం గర్భాంలో ఈ పరిశ్రమ ఉంది. పరిశ్రమకు నష్టాలు రావడంతో జులై 14 నుంచి లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఈ పరిశ్రమకు విద్యుత్ శాఖ ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ కారణంతో పాటు మార్కెట్ ధరలు తగ్గిపోవడంతో పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఈ కంపెనీకు లే ఆఫ్ ఇస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి కంపెనీకి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed